Friday 6 January 2023

"కంటివెలుగు" పథకం ఆలోచన వెనుక...


"కంటి వెలుగు" కార్యక్రమం పైన మొన్న ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఒక సమీక్షా సమావేశం నిర్వహించారు. 

జనవరి 18 నుంచి కంటి వెలుగు కార్యక్రమం మళ్ళీ ప్రారంభమవుతుంది.

ఆరోగ్యశాఖ మంత్రి హరీష్‌రావు, సంబంధిత శాఖల అధికారుల బృందం రూపొందించిన బ్లూప్రింట్ ప్రకారం -  ఈ కార్యక్రమం కింద నిపుణులైన వైద్యులు తెలంగాణలో అందరికీ కంటి పరీక్షలు చేస్తారు. పరీక్షల అనంతరం - అవసరమైనవారికి సర్జరీ, కళ్ళద్దాలు, మందులు అందజేస్తారు.

ఇంతకు ముందు 2018లో మొదటిసారిగా విజయవంతంగా తెలంగాణలో నిర్వహించిన ఈ కార్యక్రమం ఈ సారి గిన్నిస్ రికార్డ్ అందుకోవచ్చని ఒక అంచనా. 

తాజా వార్తల ప్రకారం - తెలంగాణలో ఈ రెండో విడత కంటివెలుగు కార్యక్రమాన్ని ఖమ్మంలో ఈ నెల 18 నాడు - కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ సింగ్ మాన్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్‌ల చేతుల మీదుగా లాంఛనంగా ప్రారంభించనున్నారు.  

ఆ ముగ్గురు ముఖ్యమంత్రులకు ఈ సందర్భంగా మన ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ కార్యక్రమం అవసరాన్ని, వివరాలను వివరించనున్నారు. 

తొలివిడత కంటివెలుగు కార్యక్రమంలో - తెలంగాణలో - 1 కోటి 54 లక్షల మందికి కంటి పరీక్ష నిర్వహించి, దాదాపు 50 లక్షల మందికి ఉచిత కళ్ళద్దాలు పంపిణీ చేశారు. ఈసారి - కంటి పరీక్షల తర్వాత - అవసరాన్నిబట్టి కనీసం ఒక 60 లక్షలమందికి ఉచితంగా కళ్ళద్దాలు అందిచే ఏర్పాట్లు చేస్తున్నారు. 

ప్రపంచంలోనే అతిపెద్ద కంటిపరీక్షా కార్యక్రమంగా కేసీఆర్ రూపొంచిన ఈ కంటివెలుగు కార్యక్రమం గిన్నిస్ రికార్డు సాధించినా పెద్ద ఆశ్చర్యం లేదు.   

కట్ చేస్తే - 

కట్ చేస్తే -    

75 ఏళ్ళ స్వతంత్ర భారత చరిత్రలో ఇలాంటి మానవీయ కార్యక్రమాన్ని ప్లాన్ చేసి, రాష్ట్రవ్యాప్తంగా విజయవంతంగా నిర్వహించిన ఆనవాళ్ళు ఇప్పటిదాకా ఏ రాష్ట్రంలో కూడా లేవు. 

అరుదుగా ఏవైనా స్వచ్చంద సంస్థలు నిర్వహించే ఉచిత వైద్య శిబిరాలు, సరోజినీ దేవి కంటి దవాఖాన లాంటి హాస్పిటళ్ళు రాష్ట్రానికొక్కటి తప్ప వేరే చరిత్ర లేదు. 

కేసీఆర్ గారికి ఈ పథకం ఆలోచన రావడానికి వెనకున్న కథ గురించి గత నెలలో ఒక కార్యక్రమంలో ఉపన్యసిస్తూ వారే చెప్పారు...

గజ్వేల్‌లో తాను దత్తత తీసుకోవాలని తలపెట్టిన ఒక చిన్న గ్రామంలో ఉచిత వైద్య శిబిరం పెట్టినప్పుడు - అంత చిన్న ఊళ్ళో మొత్తం 127 మంది కంటి జబ్బుతో బాధపడుతున్నట్టు తెలిసింది. వారిలో 27 మంది పిల్లలు! 

పిల్లలు తమ కళ్ళు బాగా పనిచేయటం లేదని తెలుసుకోలేరు. పెద్దలు తెలుసుకొనేటప్పటికి ఆలస్యం అవుతుంది. ఇదంతా తెలియక, వాళ్ళు బాగా చదవటంలేదని అటు స్కూళ్లో, ఇటు ఇంట్లో పిల్లలను బాధిస్తారు. ఎంత దారుణం? 

తమ కళ్ళకు ఇబ్బంది ఉందని వృద్ధులు ఇంట్లో తమ పిల్లలకు చెప్పుకోలేని పరిస్థితులు మన కళ్ళముందే చూస్తున్నాం. ఒకవేళ చెప్పినా - ఎంత శాతం మంది ఆ విషయాన్ని తమ ప్రయారిటీలో లిస్టులో పెట్టుకొని తమ తల్లిదండ్రులను కంటి డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తున్నారు? "ఇప్పుడంత తొందరేముంది?" అని అనేవాళ్లను ఎంతమందిని మనం చూడట్లేదు?  

కేసీఆర్ "కంటి వెలుగు" పథకం ఆలోచన వెనుక ఇంత బాధాకర నేపథ్యం ఉంది.

కట్ చేస్తే - 

ఈ కార్యక్రమాన్ని కేసీఆర్ రాజకీయాల కోసం, ఎన్నికల్లో లబ్ధి కోసం చేస్తున్నారని కొందరు అనడం అవివేకం. మానవత్వం లేకపోవడం. 

ఇంకొందరైతే మరీ తెలివితక్కువగా "వృద్ధులకు బ్యాలెట్ పేపర్లో కారు మీద వోటు గుద్దటానికి కళ్ళు బాగా కనిపించాలని కేసీఆర్ రూపొందించిన కార్యక్రమం ఇది" అని అనటం ఎంత అమానవీయమైన చిల్లర మాట! 

కేసీఆర్ ఆలోచనల స్థాయికి కనీస దరిదాపుల్లోకైనా చేరుకొనే స్థాయి వీరికి ఈ జన్మలో వస్తుందా? 

1 comment:

  1. "వృద్ధులకు బ్యాలెట్ పేపర్లో కారు మీద వోటు గుద్దటానికి కళ్ళు బాగా కనిపించాలని కేసీఆర్ రూపొందించిన కార్యక్రమం ఇది"

    What's wrong in it? They have right to see exactly what they are voting for.

    ReplyDelete