తెలంగాణలో ఒకవైపు ఉద్యోగాల నోటిఫికేషన్ల వర్షం కురుస్తోంది. ఆ పాజిటివ్ ప్రభంజనం గురించి ఎలాంటి బ్రేకింగ్ న్యూస్లు ఉండవు.
దాదాపు రోజుకొక కొత్త ఇండస్ట్రీస్ డీల్, రోజుకొక కొత్త ఇన్వెస్ట్మెంట్ ఒప్పందం రాష్ట్రంతో జరుగుతోంది.
ఆ బ్రేకింగ్ న్యూస్లుండవు.
ఆ బ్రేకింగ్ న్యూస్లుండవు.
2018లో విజయవంతంగా నిర్వహించిన "కంటి వెలుగు" కార్యక్రమాన్ని ఈ జనవరి 18 నుంచి కొత్త లక్ష్యాలతో మరింత విజయవంతంగా జరుపబోతున్నారు. దేశంలో ఎవ్వరూ ఎక్కడా ఇంతవరకు తలపెట్టని ఇలాంటి మానవీయ కార్యక్రమాన్ని గురించి బ్రేకింగ్ న్యూస్లు ఉండవు.
ఆదిలాబాద్ లాంటి వెనుకబడిన జిల్లాలో సాఫ్ట్వేర్ రంగాన్ని విస్తరిస్తున్నారు. ఇవి కాదు బ్రేకింగ్ న్యూస్లు.
మరేంటి వీరికి బ్రేకింగ్ న్యూస్లు?
> "ఉద్యోగాలకు నోటిఫికేషన్స్ ఇవ్వద్దు" అని ఒక వెర్రిబాగులమనిషి మాట్లాడే మతిలేని మాటలు.
> "కంటివెలుగు కార్యక్రమం అనేది ముసలోళ్ళకు బాగా కళ్ళు కనిపించి కారు మీద వోటు గుద్దటానికే" అని చెప్పే చెత్త మాటలు.
> ఒకవైపు ఖచ్చితమైన అంకెలతో విడుదలచేస్తున్న నిధుల గురించి ప్రభుత్వం చెప్తోంటే - "రైతుబంధు కోసం ప్రభుత్వం దగ్గర డబ్బుల్లేవ్" అనే చెత్త పలుకులు.
గత 60 ఏళ్లలో జరగని అభివృద్ధి రాష్ట్రంలో ఇప్పుడు జరుగుతున్నది ఈ మీడియా కళ్లకు కనిపించదు. ముఖ్యమంత్రి కేసీఆర్కు వ్యతిరేకంగా, ఆయన ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎప్పటికప్పుడు కొత్త స్క్రిప్టులు రచించి ప్రసారం చేయడమే ఈ మీడియా చేసే పని.
ఇలా చేయడం ద్వారా తాత్కాలిక లాభం వాళ్లకుండవచ్చు. కాని, ఇలాంటి గోబెల్స్ ప్రచారం వల్ల పరోక్షంగా, ప్రత్యక్షంగా ప్రజలకు ఎంత నష్టం అన్నది ఆలోచించేంత తెలివి ఈ మీడియాకు లేదు.
"ఇది మీడియా కాదు. మోడియా!" అని మంత్రి కేటీఆర్ అన్నారంటే ఊరికే ఎందుకంటారు?
కట్ చేస్తే -
దేశమంతా తిరుగుతూ - సీరీస్ ఆఫ్ ప్రెస్ మీట్లతో - జాతీయ స్థాయిలో - ఇదే మీడియాతో కేసీఆర్ కబడ్డీ ఆడుకునే రోజులు ముందున్నాయి.
గోబెల్స్ ప్రచారాలకు కూడా ఒక ఫుల్స్టాప్ తప్పక ఉంటుంది.
మోడీ నోట్లోవేలేసుకోనీ చూస్తుంటాడా?
ReplyDelete