Thursday 17 February 2022

డిజిటల్ యుగంలో కూడా... (7 ట్వీట్లు)

అందుకే నేను న్యూస్‌పేపర్స్‌కు నా ఆర్టికిల్స్ పంపించడానికి ఇష్టపడను. 

మనమేదో ఉత్సాహంలో హాట్-హాట్‌గా రాస్తాము. వాళ్ళు ఎప్పుడో తప్పకుండా వేస్తారు. 

వాళ్ళ పాలసీలు వాళ్లకుంటాయనుకోండి. కాని, మనం రాసిన సంతోషం మనకుండదు. ఎప్పుడో వాళ్ళు వేసేటప్పటికి దాని ప్రభావం పోతుంది. మనం మర్చేపోతాం!

***

హాయిగా ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశామా... హాప్పీగా ఫీలయ్యామా... అంతే!

ఇలాంటి పరిస్థితివల్ల అసలు రాయాలన్న ఉత్సాహం కూడా పోతుంది. అది అసలు ప్రమాదం. 

న్యూస్‌పేపర్స్... కనీసం "ఫలానా డేట్‌కు మీది ప్రింటవుతుంది" అని చిన్న మెసేజ్‌తో చెప్పగలగాలి. 

ఇంత డిజిటల్ యుగంలో కూడా ఇంత అస్పష్టతా?!

***

మొన్నటి ప్రెస్‌మీట్‌లో కేసీఆర్ ప్రస్తావించిన లీక్వాన్ యూ, డెంగ్ సియాపింగ్ ల గురించి ఉదాహరిస్తూ, కేసీఆర్ గారి మీద 10 రోజుల క్రితమే నేనొక ఆర్టికిల్ రాసి, పంపించాను. 

2, 3 సార్లు కాల్ చేశాను. వాళ్ల బాధలు వాళ్ళు చెప్పారు. తప్పక వేస్తున్నాం అన్నారు. వేస్తారు కూడా.

***

అంతకుముందు నావి ఎన్నో వచ్చాయి. అలా వేసుకునే స్థాయిలోనే నేను రాస్తాను.  

నిజంగానే ప్రింట్ చేస్తారు. 

కాని, ఎప్పుడు అన్నది తెలియదు. 

ఇలాంటి అస్పష్టత నాకు ఇష్టముండదు. సో, ఇకనుంచీ... ఏం చేస్తానో... నాకే తెలీదు. 🙏

***

నిజానికి దీంతో మనకు కొత్తగా వచ్చే పేరు ఏమీ ఉండదు. మరే లాభాలుండవు. పారితోషికం అసలుండదు. రాసేది కూడా వాటికోసం కాదు. 

బాధ్యతగా ఫీలయ్యి కొన్ని సార్లు, మన సంతోషం కోసం కొన్నిసార్లు ఏదేదే రాస్తుంటాం. 

***

జనరల్ నాన్సెస్‌ కోసం ఎలాగూ మన ఫేస్‌బుక్కులు, బ్లాగులున్నాయి.

ఎడిట్ పేజి స్థాయి ఆర్టికిల్స్ రాసి పోస్ట్ చేసినప్పుడే... ఎవరో ఒకరు పెద్దవాళ్ళు కాల్ చేసి చెప్తారు... "అలా పోస్ట్ చెయ్యొద్దు. ఫలానా న్యూస్ పేపర్‌కు పంపండి. అందరికీ రీచ్ అవుద్ది కదా" అని. 

***

వారన్నది నిజం. చెప్పినట్టే చేస్తాం. మంచి ఉత్సాహంతో ఇంకోటి రాసి ఈసారి డైరెక్ట్‌గా న్యూస్‌పేపర్‌కే పంపిస్తాం.  

కాని, తర్వాత జరిగేది ఇలా వుంటుంది! 🙏🙂

No comments:

Post a Comment