"చంద్రబాబు తెలంగాణ దుష్మన్!"
ఈమధ్యకాలంలో ఇంత క్యాచీ 'బ్యానర్ హెడింగ్' చూళ్లేదు నేను.
రెండ్రోజుల క్రితం నమస్తే తెలంగాణ పత్రికలో పెట్టిన బ్యానర్ హెడ్డింగ్ అది.
థాంక్స్ టూ ది ఎడిటర్ కట్టా శేఖర్రెడ్డి గారు అండ్ హిజ్ టీమ్.
ఆల్రెడీ దీన్నే ట్వీట్ కూడా పెట్టాను.
అదే పేపర్లో ఇంకో రోజు కార్టూనిస్ట్ మృత్యుంజయ కార్టూనొకటి చూశాను. సూపర్బ్!
అదేంటంటే, "సార్ లేరా ఇంట్లో?" అని టీడీపీ ఆఫీసు ముందు ఒకతను అడుగుతుంటాడు. "లేడు, పక్కింటికి పెత్తనానికెళ్ళాడు" అని చెప్తాడు అక్కడున్న ఆఫీసు బంట్రోతు.
అదీ విషయం.
కట్ చేస్తే -
ఇక్కడ తెలంగాణలో 2018 ఎన్నికల సందర్భంగా ది గ్రేట్ బాబు గారు చేస్తున్నది అదే.
అక్కడ అమరావతిలో సొంతిల్లు కట్టుకోడమే ఇంకా చేతకాలేదు. పక్కింటిమీద పెత్తనానికొచ్చాడు.
ఇప్పుడు ఇక్కడ తెలంగాణలో ఎవ్వరూ ప్రశాంతంగా ఉండొద్దు.
కేసీఆర్ మళ్లీ అధికారం లోకి రావద్దు.
ఎక్కడ వీలైతే అక్కడ మళ్లీ ఆంధ్ర-తెలంగాణ ఫీలింగ్ను గుర్తు చేయాలి.
రెచ్చకొట్టాలి .. ఎట్సెట్రా ఎట్సెట్రా ..
ఇట్లా చెప్పుకుంటూపోతే ఇంకో వంద ఆలోచనలుంటాయి బాబు గారి ఎజెండాలో.
నిజానికి, అవి ఆలోచనలు కావు. కుట్రలు.
అవన్నీ తెలంగాణకు, తెలంగాణ అభివృధ్ధికి నష్టం కలిగించేవే. ఇక్కడ హాయిగా ఉన్న మనుషులందరిమధ్య కొత్తగా ఫీలింగ్స్ను రేకెత్తించే ప్రయత్నంలో భాగంగా బాబు గారు ఇంకో మాస్టర్ ప్లాన్ వేశారు.
హరికృష్ణ కుమార్తె చుండ్రు సుహాసినిని, "నందమూరి సుహాసిని" చేసి, కుక్కట్పల్లి బరిలోకి దింపారు.
పాపం బలిపశువు సుహాసిని.
ఆమె గెలవదుగాక గెలవదు. అయినా సరే నిలబెట్టాడు. వాళ్ల పరువు తీయడంకోసం. ఇంక ఆ నందమూరి వంశంవల్ల పార్టీకి ఏం ప్రయోజనంలేదని రేపు ఎలెక్షన్ల తర్వాత చెప్పడం కోసం.
"నిజంగా నీకు అంత ప్రేమ వాళ్లమీద ఉంటే, నీ కొడుకు లోకేష్ను మినిస్టర్ చేసినట్టు, ఈ సుహాసినిని కూడా అక్కడ ఏపీలో మినిస్టర్ను చెయ్యాల్సింది. ఎందుకు చెయ్యలేదు?"
ఇది మొన్న కుక్కట్పల్లి రోడ్షోలో మన మంత్రి కేటీఆర్ సూటిగా అడిగిన ప్రశ్న.
దీనికి ఆ ప్రపంచ మేధావి సమాధానం చెప్పగలడా?
చెప్పలేడు.
తెలంగాణ బాగుపడకూడదు. ఇక్కడ ఏ ప్రాజెక్టులు నిర్మాణం కాకూడదు. ప్రతిదానికీ అడ్దంగా కేసులు పెట్టించడం, లేదంటే, వద్దు వద్దంటూ వందలకొద్దీ లెటర్లు కేంద్రానికి రాయడం.
ఆయనకు తెలంగాణవాళ్లు అన్నా పడదు. తెలంగాణ పదం అన్నా ఇష్టం ఉండదు.
అందుకే .. పాపం అక్కడ ఏపీలో ప్రజలను, ప్రభుత్వాన్ని గాలికొదిలేసి ఇక్కడ తన కుటిల చక్రంతో నానా కుట్రలు చేస్తున్నారు.
అందుకే మన ముఖ్యమంత్రి కేసీఆర్ బాగానే అన్నారు:
చంద్రబాబు తెలంగాణ దుష్మన్!
ఆ దుష్మన్ కనుసన్నల్లో నడుస్తున్న మాయాకూటమికి వోటేస్తారా? 60 ఏళ్లుగా తెలంగాణలో లేని అభివృధ్ధిని ఆఘమేఘాలమీద చేసి చూపించి, అంతర్జాతీయస్థాయిలో గుర్తింపు కూడా పొందుతున్న మన ఇంటిపార్టీ టీఆరేస్కు వోటేస్తారా?
ఆలోచించండి.
రేపు 7వ తేదీ నాడు మీ వోటు ద్వారా ఇలాంటి దుష్మన్ల ఆటలకు చెక్ పెట్టండి.
మీ వోటుతో బుధ్ధి చెప్పండి.
మరోసారి ఇటివైపు రాకుండా చెయ్యండి.
ఈమధ్యకాలంలో ఇంత క్యాచీ 'బ్యానర్ హెడింగ్' చూళ్లేదు నేను.
రెండ్రోజుల క్రితం నమస్తే తెలంగాణ పత్రికలో పెట్టిన బ్యానర్ హెడ్డింగ్ అది.
థాంక్స్ టూ ది ఎడిటర్ కట్టా శేఖర్రెడ్డి గారు అండ్ హిజ్ టీమ్.
ఆల్రెడీ దీన్నే ట్వీట్ కూడా పెట్టాను.
అదే పేపర్లో ఇంకో రోజు కార్టూనిస్ట్ మృత్యుంజయ కార్టూనొకటి చూశాను. సూపర్బ్!
అదేంటంటే, "సార్ లేరా ఇంట్లో?" అని టీడీపీ ఆఫీసు ముందు ఒకతను అడుగుతుంటాడు. "లేడు, పక్కింటికి పెత్తనానికెళ్ళాడు" అని చెప్తాడు అక్కడున్న ఆఫీసు బంట్రోతు.
అదీ విషయం.
కట్ చేస్తే -
ఇక్కడ తెలంగాణలో 2018 ఎన్నికల సందర్భంగా ది గ్రేట్ బాబు గారు చేస్తున్నది అదే.
అక్కడ అమరావతిలో సొంతిల్లు కట్టుకోడమే ఇంకా చేతకాలేదు. పక్కింటిమీద పెత్తనానికొచ్చాడు.
ఇప్పుడు ఇక్కడ తెలంగాణలో ఎవ్వరూ ప్రశాంతంగా ఉండొద్దు.
కేసీఆర్ మళ్లీ అధికారం లోకి రావద్దు.
ఎక్కడ వీలైతే అక్కడ మళ్లీ ఆంధ్ర-తెలంగాణ ఫీలింగ్ను గుర్తు చేయాలి.
రెచ్చకొట్టాలి .. ఎట్సెట్రా ఎట్సెట్రా ..
ఇట్లా చెప్పుకుంటూపోతే ఇంకో వంద ఆలోచనలుంటాయి బాబు గారి ఎజెండాలో.
నిజానికి, అవి ఆలోచనలు కావు. కుట్రలు.
అవన్నీ తెలంగాణకు, తెలంగాణ అభివృధ్ధికి నష్టం కలిగించేవే. ఇక్కడ హాయిగా ఉన్న మనుషులందరిమధ్య కొత్తగా ఫీలింగ్స్ను రేకెత్తించే ప్రయత్నంలో భాగంగా బాబు గారు ఇంకో మాస్టర్ ప్లాన్ వేశారు.
హరికృష్ణ కుమార్తె చుండ్రు సుహాసినిని, "నందమూరి సుహాసిని" చేసి, కుక్కట్పల్లి బరిలోకి దింపారు.
పాపం బలిపశువు సుహాసిని.
ఆమె గెలవదుగాక గెలవదు. అయినా సరే నిలబెట్టాడు. వాళ్ల పరువు తీయడంకోసం. ఇంక ఆ నందమూరి వంశంవల్ల పార్టీకి ఏం ప్రయోజనంలేదని రేపు ఎలెక్షన్ల తర్వాత చెప్పడం కోసం.
"నిజంగా నీకు అంత ప్రేమ వాళ్లమీద ఉంటే, నీ కొడుకు లోకేష్ను మినిస్టర్ చేసినట్టు, ఈ సుహాసినిని కూడా అక్కడ ఏపీలో మినిస్టర్ను చెయ్యాల్సింది. ఎందుకు చెయ్యలేదు?"
ఇది మొన్న కుక్కట్పల్లి రోడ్షోలో మన మంత్రి కేటీఆర్ సూటిగా అడిగిన ప్రశ్న.
దీనికి ఆ ప్రపంచ మేధావి సమాధానం చెప్పగలడా?
చెప్పలేడు.
తెలంగాణ బాగుపడకూడదు. ఇక్కడ ఏ ప్రాజెక్టులు నిర్మాణం కాకూడదు. ప్రతిదానికీ అడ్దంగా కేసులు పెట్టించడం, లేదంటే, వద్దు వద్దంటూ వందలకొద్దీ లెటర్లు కేంద్రానికి రాయడం.
ఆయనకు తెలంగాణవాళ్లు అన్నా పడదు. తెలంగాణ పదం అన్నా ఇష్టం ఉండదు.
అందుకే .. పాపం అక్కడ ఏపీలో ప్రజలను, ప్రభుత్వాన్ని గాలికొదిలేసి ఇక్కడ తన కుటిల చక్రంతో నానా కుట్రలు చేస్తున్నారు.
అందుకే మన ముఖ్యమంత్రి కేసీఆర్ బాగానే అన్నారు:
చంద్రబాబు తెలంగాణ దుష్మన్!
ఆ దుష్మన్ కనుసన్నల్లో నడుస్తున్న మాయాకూటమికి వోటేస్తారా? 60 ఏళ్లుగా తెలంగాణలో లేని అభివృధ్ధిని ఆఘమేఘాలమీద చేసి చూపించి, అంతర్జాతీయస్థాయిలో గుర్తింపు కూడా పొందుతున్న మన ఇంటిపార్టీ టీఆరేస్కు వోటేస్తారా?
ఆలోచించండి.
రేపు 7వ తేదీ నాడు మీ వోటు ద్వారా ఇలాంటి దుష్మన్ల ఆటలకు చెక్ పెట్టండి.
మీ వోటుతో బుధ్ధి చెప్పండి.
మరోసారి ఇటివైపు రాకుండా చెయ్యండి.
సుహాసినికి ఎన్టీఆర్ ఝలక్
ReplyDeletehttps://www.sakshi.com/news/politics/jr-ntr-skips-kukatpally-election-campaign-1140498
చుండ్రు సుహాసిని బక్రా అయింది, జూనియర్ కాస్త తెలివిగా బయట పడ్డాడు.
Please see my analysis (part-1) on the elections:
ReplyDeletehttps://jaigottimukkala.blogspot.com/2018/12/2018-assembly-election-results-analysis_22.html