Thursday 17 November 2016

ది లీడర్

సుమారు 130 కోట్ల జనాభా ఉన్న ఒక దేశ ప్రధానిగా నరేంద్ర మోదీ ఏదో ఆదరా బాదరాగా రాత్రికి రాత్రే ఓ చెత్త నిర్ణయం తీసుకుంటాడని ఎవ్వరూ అనుకోరు.

ఒకవేళ దాని వెనుక ఏదైనా చిన్న రాజకీయ అవసరం ఉన్నా, దేశ ప్రయోజనం అనే గట్టి బేస్ లేకుండా ఇలాంటి నిర్ణయం మోదీ తీసుకోలేడు. ఇందులో ఎవ్వరికీ ఎలాంటి సందేహం ఉండనక్కరలేదు.

కానీ, ఏ నల్లకుబేరులనైతే టార్గెట్ చేసి ఈ నిర్ణయం తీసుకున్నారో, వారి సంఖ్య మొత్తం దేశ జనాభాలో కేవలం 2 శాతాన్ని మించి ఉండదని ఒక అంచనా.

ఈ 2 శాతం మేనిప్యులేటర్స్‌ను ట్రాక్ చేసి పట్టుకొనే ఒక పటిష్టమైన సిస్టమ్‌ను రూపొందించలేనంత బలహీనమైందా మనదేశ ఆర్థిక యంత్రాంగం ? అంత సామర్థ్యం లేనిదా? నిజంగా నమ్మశక్యం కాదు.

ఆ 2 శాతం బ్లాక్‌మనీ వాళ్లకోసం మిగిలిన 98% మంది దైనందిన జీవితం రాత్రికి రాత్రే ఊహించనివిధంగా తల్లకిందులు కావల్సిందేనా?

ఈ స్థంభన, ఈ గందరగోళం ఇంకెన్నాళ్లు అంటే ఖచ్చితంగా చెప్పే పరిస్థితి లేకపోవడం నిజంగా విచారకరం.


కట్ టూ కె సి ఆర్ -    

ఏరంగంలోనైనా సరే, ఊహించకుండా వచ్చే ప్రతికూల పరిస్థితులను కూడా తనకు అనుకూలం చేసుకొని ముందుకుపోగలిగినవాడే తిరుగులేని నాయకుడవుతాడు.

మన తెలగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె సి ఆర్ అలాంటి నాయకుడు. ఇదే లక్షణాన్ని మన IT మినిస్టర్ KTR కూడా పుణుకిపుచ్చుకున్నాడు.

ముందు నవంబర్ 11 వరకు అని, తర్వాత నవంబర్ 14 వరకు అని, ఇప్పుడు నవంబర్ 24 వరకు అని .. ఇదే అదునుగా, ఏళ్లుగా బకాయిలున్న టాక్స్‌లన్నిటినీ ఒక్క దెబ్బతో మోదీ చెల్లు చెప్పిన ఆ పాత 500, 1000 నోట్లతోనే కట్టించేసుకున్నారు మనవాళ్లు.

ఒక్క బకాయిలేకాదు, ఫ్యూచర్ టాక్స్‌లు కూడా ఇప్పుడే కట్టించుకోవడం అనేది నిజంగా ఒక అద్భుతమైన టాలెంట్!

కేంద్రాన్ని ఒప్పించి మనవాళ్లు తీసుకొన్న ఈ చొరవ వల్ల, దేశంలోని అన్ని రాష్ట్రాలకు కూడా ఇది మంచి లాభదాయకమైంది. వాళ్లూ మనల్నే ఫాలో అవుతున్నారు.

ముందు దేశం. తర్వాత రాష్ట్ర ప్రయోజనాలు. ఇది కె సి ఆర్ కు బాగా తెలుసు.

ఇది తెలుసు కాబట్టే - దేశంలోని మిగిలిన అందరు CM ల లాగా మందలో కలిసిపోయి గందరగోళం చేయటంలేదు.

ఇప్పుడు ప్రారంభమైన పార్లమెంట్ సమావేశాల్లో కూడా మన రాష్ట్ర ఎం పి లకు ఈ విషయంలో ఖచ్చితమైన ఆదేశాలిచ్చాడు కె సి ఆర్:

"ఈ చర్య వల్ల మనకు రాష్ట్రంలో ఎదురవుతున్న తీవ్రమైన అసౌకర్యం గురించీ, ప్రతిరోజూ భారీస్థాయిలో కోల్పోతున్న మన ఆదాయం గురించీ వివరంగా చెప్పండి. కానీ, సమావేశాలు మాత్రం సజావుగా జరుగనివ్వండి" అని.

రేపు నవంబర్ 24వ తేదీన ప్రధాని ఇచ్చే వివరణ పూర్తిగా విన్నతర్వాతే దీనిపైన తగిన నిర్ణయం తీసుకోవాలన్నది కె సి ఆర్ ఉద్దేశ్యం.

కేవలం రాజకీయం కోసమో, మొహమాటానికో గుంపులో గోవిందా అనే రకం కాదు మన కె సి ఆర్.

మన దేశం. మన రాష్ట్రం. మన ఐడెంటిటీ. మన ఆలోచన.

వెరసి - ఒక మెచ్యూర్డ్ పొలిటీషియన్. ఒక సిన్సియర్ స్టేట్స్‌మన్. ఒక రియల్ లీడర్.

అది .. మన కె సి ఆర్.   

No comments:

Post a Comment